IND vs NZ : టీమిండియా సీనియర్ పేసర్ షమీ మరోసారి కివీస్ను దెబ్బకొట్టాడు. తొలి వన్డేలో సెంచరీ హీరో బ్రేస్వెల్ (22)ను పెవిలియన్ పంపాడు. దాంతో కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన 19వ ఓవర్ మూడో బంతికి కీపర్ ఇషాన్కు క్యాచ్ ఇచ్చి బ్రేస్వెల్ వెనుదిరిగాడు. తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన అతను ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే.. షమీ మూడో బంతికి అతడిని బోల్తా కొట్టించాడు. 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిని కివీస్ బ్రేస్వెల్, ఫిలిఫ్స్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఆరో వికెట్కు 41పరుగలు సాధించారు. బ్రేస్వెల్ 30 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఫిలిప్స్, శాంటర్న్ క్రీజులో ఉన్నారు. 19 ఓవర్లకు ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 56 రన్స్ చేసింది.