న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ 20లో సూర్యకుమార్ అద్భుతరీతిలో శతకం సాధించాడు. 49 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దాంతో, భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ 111 స్కోర్తో నాటౌట్గా నిలిచాడు. టీ 2ం ఫార్మాట్లో సూర్యకు ఇది రెండో సెంచరీ. హాఫ్ సెంచరీకి 32 బంతులు తీసుకున్న సూర్య ఆ తర్వాత వేగం పెంచాడు. దొరికిన బంతిని దొరికినట్టల్లా బౌండరీకి తరలించాడు. దాంతో, మరో 17 బంతులో 50 పరుగులు చేసి, సెంచరీ మార్క్ అందుకున్నాడు.
సౌథీ హ్యాట్రిక్
న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ హ్యాట్రిక్ సాధించాడు.చివరి ఓవర్లో మూడో బంతికి హార్ధిక్ పాండ్యా వికెట్ తీసిన సౌథీ, ఆ తర్వాతి రెండు బంతుల్లో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ని డకౌట్ చేశాడు. ఇతనికి టీ 20ల్లో ఇది రెండో హ్యాట్రిక్. ల్యూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశారు. స్పిన్నర్ ఇష్ సోధీకి ఒక వికెట్ దక్కింది.
సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీతో భారత్ 191 పరుగులు చేసింది
మొదటి టీ 20 వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. వర్షం రావడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా వచ్చారు.