కోల్కతా : వరుసగా మూడో మ్యాచ్లోనూ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. భారత టీ20 జట్టు సారధిగా రోహిత్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆడుతున్న పేటీయం సిరీస్లో మూడో టీ20 మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. రెండేళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
ఇక్కడ చివరగా 2019లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి రెండు మ్యాచ్లలో బౌలింగ్ ఎంచుకున్న రోహిత్.. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తామని తెలిపాడు.
ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, అశ్విన్కు విశ్రాంతినిచ్చామని, వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్ ఆడతున్నారని వెల్లడించాడు. న్యూజిల్యాండ్ జట్టులో కెప్టెన్ టిమ్ సౌథీకి విశ్రాంతినిచ్చి లోకీ ఫెర్గూసన్ను జట్టులోకి తీసుకున్నారు. సౌథీ గైర్హాజరీలో కెప్టెన్గా శాంట్నర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
భారత్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్
న్యూజిల్యాండ్: మార్టిన్ గప్తిల్, డారియల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, సేఫెర్ట్, జేమ్స్ నీషమ్, శాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్.