IND vs NZ : భారత్ రెండో వికెట్ కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి (44) ఔట్ అయ్యాడు. సోధీ ఓవర్లో షాట్కు ప్రయత్నించి ఫెర్గూసన్కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో 87 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అతను ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి ధాటిగా ఆడాడు. రెండో వికెట్కు ఈ జోడీ 42 బంతుల్లోనే 80 పరుగులు జోడించింది. ప్రస్తుతం శుభ్మన్ గిల్ (40), సూర్యకుమార్ యాదవ్ (6) ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్.. 94/2 ఫెర్గూసన్, టిక్నర్ ఓవర్లో గిల్, రాహుల్ రెచ్చిపోయారు. ఫెర్గూసన్ ఓవర్లో రాహుల్ ఫోర్, సిక్స్ కొట్టాడు. టిక్నర్ ఓవర్లో గిల్ ఏకంగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో, ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.