IND vs NZ : న్యూజిలాండ్తో టీ20 సమరం మరికాసేపట్లో రాంచీలో మొదలుకానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వన్డే సిరీస్ గెలిచి ఊపు మీదున్న భారత్ పొట్టి సిరీస్ను కూడా కన్నేసింది. తొలి మ్యాచ్లో విజయంతో శుభారంభం చేయాలని భావిస్తోంది. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వీ షాకు తుది జట్టులో చోటు దక్కలేదు. దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ పాత్ర పోషించనున్నారు. మరోవైపు వన్డేల్లో దారుణ ఓటమితో పాటు వన్డే ర్యాంకింగ్ కోల్పోయిన కివీస్ పరువు కోసం పోరాడనుంది. బ్లాక్ కాప్స్ జట్టు శాంటర్న్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది.
భారత జట్టు : ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.
కివీస్ జట్టు : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంటర్న్(కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధీ, ల్యూకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.