IND vs NZ : కివీస్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్వెల్ విధ్వంసక ఇన్నింగ్స్తో సెంచరీ సాధించాడు. 57 బంతుల్లోనే 11 ఫోర్లు 5 సిక్సర్లతో శతకం చేశాడు. షమీ బౌలింగ్లో సిక్స్ బాది వంద పరుగుల మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతను శాంట్నర్తో కలిసి ఏడో వికెట్కు 136 పరుగులు జోడించాడు. శాంట్నర్ 38 రన్స్తో ఆడుతున్నాడు. వీళ్లిద్దరూ భారత బౌలర్లను ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతున్నారు. దాంతో న్యూజిలాండ్ స్కోర్ 250 దాటింది 42 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 261 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 90 పరుగులు కావాలి.