క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో టీమ్ఇండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నది. వరుసగా మూడో సారి టాస్ ఓడిన ధావన్.. శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. జట్టుకు మరోసారి శుభారంభాన్ని అందిస్తారనుకున్న టీమ్ఇండియా ఓపెనింగ్ జోడీని కివీస్ బౌలర్ ఆడమ్ నిలువరించాడు. ఇన్నింగ్ 8వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్న గిల్ను (13).. ఆడమ్ తన నాలుగో బంతికి ఔట్ చేశాడు. దీంతో జట్టు స్కోరు 39 రన్స్ వద్ద తొలివికెట్ కోల్పోయింది. ప్రస్తుతం శిఖర్ ధావన్ 28 (42), శ్రేయస్ అయ్యర్ 12 (11) క్రీజ్లో ఉన్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి టీమ్ఇండియా వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.