IND vs ENG: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ స్వల్ప విరామం తర్వాత భారత్తో మూడో టెస్టుకు సిద్ధమైంది. రేపటి (ఫిబ్రవరి 15) నుంచి రాజ్కోట్ (సౌరాష్ట్ర) వేదికగా జరుగనున్న మూడో టెస్టుకు బరిలోకి దిగబోయే తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్కు వందో టెస్టుగా బరిలోకి దిగబోతున్న ఈ టెస్టులో ఇంగ్లండ్.. ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. వైజాగ్ టెస్టులో అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ షోయభ్ బషీర్.. మూడో టెస్టులో బెంచ్కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్.. పేసర్ మార్క్వుడ్ను తుదిజట్టులోకి తీసుకుంది.
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ టెస్టును ఇంగ్లండ్ నెగ్గగా వైజాగ్ టెస్టులో భారత్ జయకేతనం ఎగురవేసింది. రాజ్కోట్ వేదికగా జరుగబోయే మూడో టెస్టు ఇరు జట్లకూ కీలకం కానున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్.. గత రెండు టెస్టుల మాదిరిగా ముగ్గురు స్పిన్నర్లు, ఒక పేసర్తో కాకుండా 2+2 ఫార్ములాతో బరిలోకి దిగబోతుండటం గమనార్హం. రాజ్కోట్ పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టెస్టులో తొలి మూడు రోజులు బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ ఆఖరి రెండు రోజుల్లో మాత్రం స్పిన్కు అనుకూలించే అవకాశాలు మెండుగా ఉంటాయి. వైజాగ్ టెస్టులో కూడా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వైజాగ్ టెస్టులో అరంగేట్రం చేసిన బషీర్.. రెండు ఇన్నింగ్స్లలో నాలుగు వికెట్లు తీశాడు.
One change to our XI for the third Test in Rajkot 🏏 🔁
🇮🇳 #INDvENG 🏴 #EnglandCricket
— England Cricket (@englandcricket) February 14, 2024
రాజ్కోట్ టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రిహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్