IND vs ENG 2nd Test: విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో ముగిసిన ఉత్కంఠ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. 399 పరుగుల ఛేదనలో భాగంగా ఒకదశలో మ్యాచ్ గెలిచేదిశగా సాగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల కట్టడిచేయడంతో పరాజయం తప్పించుకోలేకపోయింది. భారీ ఛేదన అని తెలిసినా, ఉపఖండపు పిచ్లపై చివరి రెండు రోజులు ఈ టార్గెట్ ఛేజింగ్ అంత వీజీ కాదని ఆందోళన ఉన్నాఇంగ్లండ్ తన సహజసిద్ధమైన బజ్బాల్ ఆట ఆడి భారీ మూల్యం చెల్లించుకుంది. అయితే ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో ఓడినా ఓ అరుదైన రికార్డును సాధించింది. అదేంటంటే…!
భారత్లో టెస్టు మ్యాచ్ ఆడుతూ నాలుగో ఇన్నింగ్స్ ఛేదనలో ఒక పర్యాటక జట్టు ఇన్ని పరుగులు చేయడం ఇది రెండోసారి మాత్రమే. భారత్లో ఇంతవరకూ ఏ పర్యాటక జట్టూ 300 ప్లస్ టార్గెట్ ఛేదించలేదు. గతంలో వెస్టిండీస్ మాత్రమే ఈ ఘనత దక్కించుకుంది. 1987లో విండీస్.. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకూ ఇదే రికార్డు. తాజాగా ఇంగ్లండ్ ఛేదనలో ఈ రికార్డును (పరుగుల పరంగా మాత్రమే) అధిగమించింది. వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్.. 292 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ కంటే ముందే లంక.. విండీస్ రికార్డును అధిగమించినా ఆ జట్టు కూడా విజయం సాధించలేకపోయింది. 2017లో భారత పర్యటనకు వచ్చిన లంకేయులు.. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో భాగంగా రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 409 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక ఐదు వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. భారత్లో రెండో ఇన్నింగ్స్ ఛేదనలో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇదే. ఇంగ్లండ్ ఈ రికార్డుకు ఏడు పరుగుల దూరంలో నిలిచి రెండో స్థానానికి పరిమితమైంది.
India have levelled the five-match series 1-1 🔥#WTC25 | #INDvENG 📝: https://t.co/gA12xVUZjT pic.twitter.com/jbe4Tj8i2L
— ICC (@ICC) February 5, 2024
వైజాగ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించిన ఇంగ్లండ్.. రెండో రోజు అదే ఆటతీరును ప్రదర్శించింది. జాక్ క్రాలే (73) మరోసారి ఆకట్టుకున్నాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు దూకుడుగా ఆడే క్రమంలో తక్కువస్కోరుకే పరిమితమవడంతో పాటు భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆఖర్లో బెన్ ఫోక్స్ (36), టామ్ హర్ట్లీ (36)లు కాస్త చికాకు తెప్పించినా బుమ్రా ఆ ఇద్దరినీ ఔట్ చేసి భారత్కు విజయాన్ని అందించాడు. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా, అశ్విన్లు తలా మూడు వికెట్లు పడగొట్టగా ముకేశ్, కుల్దీప్, అక్షర్ పటేల్లు చెరో వికెట్ తీశారు.