IND vs ENG 1st Test: ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యం వంద పరుగులు దాటింది. టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్థ సెంచరీతో రాణించడంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్తో పాటు మిడిలార్డర్లో కెఎల్ రాహుల్ (86), శ్రేయస్ అయ్యర్ (35)లు రాణించగా లోయరార్డర్లో జడ్డూకు తోడుగా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (81 బంతుల్లో 41, 3 ఫోర్లు) రాణించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. మూడో సెషన్లో 95 ఓవర్లు ముగిసేప్పటికీ భారత్ 7 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. జడేజా.. 63 పరుగులతో క్రీజులో ఉండగా అక్షర్ పటేల్ (10 నాటౌట్) అతడికి అండగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 128 పరుగులుగా ఉంది.
లంచ్ తర్వాత కెఎల్ రాహుల్ సెంచరీ మిస్ చేసుకోగా అతడి స్థానంలో వచ్చిన శ్రీకర్ భరత్.. నింపాదిగా ఆడాడు. జడ్డూతో కలిసి భరత్ ఆరో వికెట్కు 68 పరుగులు జోడించాడు. నలుగురు స్పిన్నర్లు (జాక్ లీచ్, టామ్ హర్ట్లీ, రిహాన్ అహ్మద్, జో రూట్) క్రమం తప్పకుండా స్పిన్ దాడికి దిగినా ఈఇద్దరూ సుమారు 24 ఓవర్ల పాటు క్రీజులో నిలవడం గమనార్హం.
Watch out for that trademark sword celebration 😎
Ravindra Jadeja at his best 🙌
Follow the match ▶️ https://t.co/HGTxXf7Dc6#TeamIndia | #INDvENG | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/2WJbTYPL1x
— BCCI (@BCCI) January 26, 2024
84 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన జడ్డూకు ఇది టెస్టులలో 20వ అర్థ శతకం. లీచ్ వేసిన 88వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీయడంతో భారత్ 350 పరుగుల మైలురాయిని దాటడమే గాక టీమిండియా లీడ్ వంద పరుగులు దాటింది. అర్థ సెంచరీ దిశగా సాగుతున్న భరత్.. రూట్ వేసిన 89వ ఓవర్లో రెండో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. భరత్ ఔట్ అయిన కొద్దిసేపటికే భారత్ మరో కీలక వికెట్ కోల్పోయింది. రూట్ వేసిన 91వ ఓవర్లో మూడో బంతికి అశ్విన్ (1) రనౌట్ అయ్యాడు.