నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యమైన మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన ఆస్ట్రేలియా మాథ్యూ వేడ్ (43 నాటౌట్), ఆరోన్ ఫించ్ (31) రాణించడంతో 90/5 స్కోరు సాధించింది.
లక్ష్య ఛేదనలో భారత ఛేజింగ్ను కెప్టెన్ రోహిత్ శర్మ (46 నాటౌట్) ముందుండి నడిపించాడు. ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన అతనికి కేఎల్ రాహుల్ (10), విరాట్ కోహ్లీ (11) కొంత సహకారం అందించారు. సూర్యకుమార్ (0) డకౌట్ అవడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (9) రోహిత్కు సహకారం అందించాడు. అయితే 7వ ఓవర్లో భారీ షాట్కు యత్నించి అతను కూడా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ (2 బంతుల్లో 10 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. దీంతో భారత జట్టు 7.2 ఓవర్లలోనే 92 స్కోరు చేసి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లు తీసుకోగా.. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీసుకున్నాడు.. ఈ విజయంతో మూడు మ్యాచుల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది.