మొహాలీ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లీస్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికే దినేష్ కార్తీక్ (6) పెవిలియన్ చేరాడు. నాథన్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్ వైపు ఆడేందుకు డీకే ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను మిస్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. రివ్యూలో అవుటని తేలడంతో డీకే నిష్క్రమించాడు. దీంతో భారత జట్టు 176 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.