ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇస్తాడని అనుకున్న దినేష్ కార్తీక్ (20) కూడా అవుటయ్యాడు. కేన్ రిచర్డ్సన్ వేసిన 17వ ఓవర్లో బౌండరీ బాదిన డీకే.. ఆ మరుసటి బంతికి సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు. అతను కొట్టిన స్లాగ్ స్వీప్.. వేరే ఏదైనా మైదానంలో అయితే కచ్చితంగా సిక్సర్ అయ్యేదే.
కానీ ఇక్కడి పెద్ద బౌండరీని డీకే క్లియర్ చేయడంలో ఫెయిలయ్యాడు. దీంతో డీప్ మిడ్వికెట్లో ఉన్న మ్యాక్స్వెల్ మంచి క్యాచ్ పట్టేసి అతన్ని పెవిలియన్ పంపాడు. దీంతో భారత జట్టు 17 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులతో నిలిచింది.