చెన్నై: వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పరుగులు రాబట్టడానికి ఆస్ట్రేలియా జట్టు నానా తంటాలు పడుతోంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్, పకడ్బందీ ఫీల్డింగ్తో ఆసీస్ స్కోర్ బోర్డు మందకొడిగా కదులుతోంది. బ్యాటర్లకు పరుగులు రాబట్టడం గగనంగా మారిపోయింది. జడేజా వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టి ఆ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టేశాడు.
ఆసీస్ స్కోర్ ఐదు పరుగులు ఉన్నప్పుడే మిచెల్ మార్ష్ను బుమ్రా డకౌట్ చేశాడు. కోహ్లీకి క్యాచ్ ఇచ్చి మార్ష్ వెనుదిరిగాడు. ఆ తర్వాత 17వ ఓవర్లో జట్టు స్కోర్ 74 పరుగులు ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ (41) కుల్దీప్ యాదవ్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆపై 28 ఓవర్లో జట్టు స్కోర్ 110 వద్ద స్టీవెన్ స్మిత్ (46) క్లీన్ బౌల్డయ్యాడు. అప్పటికి ఆసీస్ స్కోర్ 110/3. అనంతరం 30వ ఓవర్లో లబుషేన్ (27), అలెక్స్ క్యారీలను జడేజా పెవిలియన్కు పంపాడు. దాంతో 30 ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది.