భారత్తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్.. తొలి ఓవర్లో 10 పరుగులు రాబట్టింది. మరుసటి ఓవర్లో అక్షర్ పటేల్ బంతి అందకున్నాడు. తొలి బంతికి బౌండరీ బాదిన గ్రీన్.. మూడో బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అక్షర్ వేసిన బంతిని మిడాన్ వైపు కొట్టిన గ్రీన్.. వేగంగా సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు.
అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వెంటనే రియాక్ట్ అయి.. బంతిని అక్షర్ పటేల్ వైపు విసిరాడు. ఆ బంతి తన చేతుల్లోకి రాగానే వికెట్లను కూల్చిన అక్షర్.. గ్రీన్ను రనౌట్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి గ్లెన్ మ్యాక్స్వెల్ (0) కూడా డకౌట్ అయ్యాడు. అక్షర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడబోయిన మ్యాక్సీ.. దాన్ని పూర్తిగా మిస్ అయ్యాడు. దాంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆసీస్ జట్టు రెండు ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 19 పరుగులతో నిలిచింది.