కింగ్ కోహ్లీ (122 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ కేఎల్ రాహుల్ (62)తో కలిసి అద్భుతమైన ఆరంభం ఇచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత వెంట వెంటనే రాహుల్, సూర్యకుమార్ యాదవ్ (6) అవుటవడంతో కొంచెం నెమ్మదించాడు.
అయితే చివరి ఐదు ఓవర్లలో ప్రతి బంతిని బౌండరీ బాదేందుకే ప్రయత్నించిన కోహ్లీ జట్టుకు భారీ స్కోరు అందించాడు. తను ఎదుర్కొన్న తొలి 40 బంతుల్లో 59 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ తర్వాత కేవలం 21 బంతుల్లో 72 పరుగలు చేశాడు. అతనికి రిషభ్ పంత్ (20 నాటౌట్) సహకరించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్ఘాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకోగా.. మిగతా బౌలర్లంతా విఫలమయ్యారు.
Innings Break!
A stupendous 122* from @imVkohli and a well made 62 from @klrahul as #TeamIndia post a formidable total of 212/2 on the board.
Scorecard – https://t.co/QklPCXU2GZ #INDvAFG #AsiaCup2022 pic.twitter.com/RqpN6t0tOM
— BCCI (@BCCI) September 8, 2022