అబుధాబి: ఇది కదా ప్రతి భారత అభిమానీ కోరుకుంది. పాక్, న్యూజిల్యాండ్ చేతిలో ఘోర పరాభవాల తర్వాత టీమిండియా జూలువిదిల్చింది. ఆఫ్ఘనిస్థాన్పై భారత ఓపెనర్లు చెలరేగుతున్నారు. రోహిత్ శర్మ (44 నాటౌట్), కేఎల్ రాహుల్ (40 నాటౌట్) పోటీపడి మరీ పరుగులు చేస్తున్నారు.
వీరి జోడీని ఎలా విడగొట్టాలో తెలియక ఆఫ్ఘన్ బౌలర్లు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. రోహిత్-రాహుల్ జోడీ అద్భుతంగా ఆడుతుందటంతో 10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. దీంతో భారీ స్కోరుకు పునాదులు పడినట్లే కనిపిస్తోంది.