టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అదరగొడుతోంది. కేఎల్ రాహుల్కు విశ్రాంతినివ్వడంతో ఓపెనర్ అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (29), కెప్టెన్ రోహిత్ శర్మ (39 నాటౌట్) జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆధిపత్యం కనబరిచారు. లయతప్పిన బంతులను నిర్దాక్షిణ్యంగా బౌండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.
దీంతో తొలి పవర్ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 69 పరుగులతో నిలిచింది. అయితే కివీస్ కెప్టెన్ శాంట్నర్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికే ఇషాన్ అవుటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు.