న్యూఢిల్లీ: ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాజయాలు చవిచూసిన ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. దీంతో భారత్తో తదుపరి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఇండోర్ టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. స్టార్క్ కూడా గాయం నుంచి కోలుకోవడంతో కమిన్స్ స్థానంలో అతడు తుది జట్టులోకి రావడం ఖాయమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య వచ్చే నెల 1 నుంచి ఇండోర్ వేదికగా మూడో టెస్టు ప్రారంభంకానుంది.