Anand Mahindra : ఫిఫా వరల్డ్ కప్లో ఆసియా జట్టు జపాన్ ప్రస్థానం ముగిసింది. క్రోయేషియా చేతిలో ఆజట్టు ఓడిపోయింది. దాంతో జపాన్ అభిమానులు నిరాశకు గురయ్యారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు కోచ్ హజిమె మొరియసు అభిమానులకు వంగి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేశాడు. భారమైన మనసుతో అతను మైదానంలో వంగి నమస్కరించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోపై భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో స్పందించాడు. ఈ ఫొటోను వర్ణించడానికి రెండు మాటలు చాలు. అంకితభావం, సహృదయం అని ఆయన ట్వీట్ చేశాడు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ను 24వేలమంది లైక్ చేశారు. చాలామంది రీ-ట్వీట్ చేశారు.
జపాన్ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అయిన హజిమె ప్రస్తుతం కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆటగాడిగా 14 ఏళ్ల కెరీర్లో 250 మ్యాచ్లో ఆడాడు. అతని నాయకత్వంలో జపాన్ గ్రూప్ మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి మ్యాచ్లోనే 2-1తో స్పెయిన్కు షాకిచ్చింది. ఆ తర్వాత కోస్టారికా, జర్మనీల మీద విజయం సాధించి 16వ రౌండ్కు చేరింది. అయితే.. ఉత్కంఠభరితంగా జరిగిన 16వ రౌండ్లో క్రొయేషియా పెనాల్టీ షూట్ ద్వారా జపాన్ను ఓడించింది. మొదటి సారి వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న ఆ జట్టు కోరిక నెరవేరలేదు. జపాన్పై విజయం సాధించడంతో క్రొయేషియా క్వార్టర్ ఫైన్ల్కు చేరింది.
Just two words to describe this: Dignity. Grace.
(Team Japan manager Hajime Moriyasu bowing to fans in gratitude) pic.twitter.com/wH2rNMhZ2A— anand mahindra (@anandmahindra) December 6, 2022