ఐజిల్ ఆఫ్ మ్యాన్ : ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్లు విదిత్ గుజరాతి, ఆర్.వైశాలి టైటిల్స్ సాధించారు. అంతేగాక వీరిద్దరూ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీలో విదిత్ చివరి రౌండ్లో సెర్బియాకు చెందిన అలెగ్జాండర్ ప్రెద్కెను ఓడించి ఏడో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 8.5 పాయింట్లు సాధించిన విదిత్ అగ్రస్థానంలో నిలిచి టైటిల్ దక్కించుకున్నాడు. కాగా వైశాలి మంగోలియా క్రీడాకారిణి బత్కుయాగ్ ముంగ్తూల్తో మ్యాచ్ను డ్రా చేసుకుని 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ అందుకుంది. టైటిల్స్తో పాటు విదిత్ రూ.66 లక్షలు, వైశాలి రూ.20 లక్షలు ప్రైజ్మనీ గెలుచుకున్నారు.