లాహార్: పాకిస్థాన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో జాతీయ జట్టు తరఫున 121 మ్యాచ్లాడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్.. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ ఏడాది ఏప్రిల్లో పాకిస్థాన్ తరఫున చివరి టీ20 ఆడిన 34 ఏండ్ల ఇమాద్ వన్డేల్లో 44, టీ20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా తనకు సహకారం అందించిన వారికి ధన్యవాదాలు తెలిపిన ఇమాద్.. ఇక మీదట లీగ్ క్రికెట్లో మాత్రమే ఆడుతానని వెల్లడించాడు.