వింబుల్డన్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న పోలాండ్ టెన్నిస్ ప్లేయర్ ఇగా స్వియాటెక్కు వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో చుక్కెదురైంది. 37 మ్యాచ్లుగా ఓటమి ఎరుగకుండా సాగుతున్న ప్రపంచ నంబర్వన్ స్వియాటెక్ శనివారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 4-6, 2-6తో 37వ ర్యాంకర్ అలీజ్ కార్నెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలైంది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించిన స్వియాటెక్.. తాజా పోరులో 33 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. వరుసగా ఆరు టోర్నీలు నెగ్గి వింబుల్డన్లో అడుగుపెట్టిన స్వియాటెక్ గంటన్నర పాటు సాగిన పోరులో వరుస సెట్లలో ఓటమి పాలైంది. ఇతర మ్యాచ్ల్లో అనిసిమోవా 6-7 (4/7), 6-2, 6-1తో కోకో గాఫ్పై, హలెప్ 6-4, 6-1తో ఫ్రెచ్పై, జెబుర్ 6-2, 6-3తో పారీపై విజయాలు సాధించారు.