బెంగుళూరు: దక్షిణాఫ్రికాతో జనవరి 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సిరీస్కు సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి వన్డే సిరీస్ కోసం కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ గాయపడ్డ రోహిత్ ప్రస్తుతం బెంగుళూరులోని ఎన్సీఏ అకాడమీలో కోలుకుంటున్నారు. ఒకవేళ వన్డే సిరీస్ సమయానికి రోహిత్ కోలుకోని పక్షంలో.. కెప్టెన్సీ బాధ్యతలను రాహుల్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీని.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య తొలి టెస్టు నడుస్తోంది.