Ind Vs Pak | ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా మరి కాసేపట్లో ఇండియా vs పాకిస్తాన్ (Ind Vs Pak ) మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత అభిమానులతో పాటు, పాకిస్తాన్ అభిమానులు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంకు చేరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమ్ఇండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్కు వస్తున్న టీమ్ఇండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ విమానంలో వస్తూ ఒక ఫొటో షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోలో కార్తీక్తో పాటు ఇండియన్ లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఉన్నారు. ఈ విషయాన్ని కార్తీక్ ట్విట్టర్లో రాసుకోస్తూ.. ”ఈరోజు 35,000 అడుగుల ఎత్తులో రాయల్టీ. టీమిండియాకు ఆల్ ది బెస్ట్” అంటూ రాసుకోచ్చాడు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Royalty at 35,000 ft ✈️
Wishing #TeamIndia all the very best for today! 🇮🇳#INDvPAK pic.twitter.com/beqYIcuvcy
— DK (@DineshKarthik) October 14, 2023