Avanish Rao | బెనోనీ: దేశంలో క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతీ ప్లేయర్ మహేంద్రసింగ్ దోనీ సారథ్యంలో ఆడాలనుకుంటాడని.. భారత అండర్-19 జట్టు వికెట్ కీపర్ అరవెల్లి అవనీశ్ రావు అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ తెలంగాణ కుర్రాడిని ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసుకుంది.
ఆస్ట్రేలియాతో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్కు ముందు అవనీశ్ మాట్లాడుతూ.. ‘ధోనీ సార్ సారథ్యంలో ఆడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అసలు చెన్నై జట్టుకు ఎంపికైనప్పుడు నమ్మలేకపోయా. అయితే ప్రస్తుతం వరల్డ్కప్ గురించే ఆలోచిస్తున్నా. ఆ తర్వాత ఐపీఎల్పై దృష్టి పెడతా. చెన్నై జట్టుకు ఏం అవసరమో అది చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అని అన్నాడు.