ICC Test Rankings | ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్గా భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా జరిగిన టెస్టులో అశ్విన్ తొమ్మిది వికెట్లు కూల్చి నెంబర్ వన్ స్థానానికి చేరాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ను బుధవారం విడుదల చేసింది. టీమిండియా మరో బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడోస్థానానికి స్థానానికి పడిపోగా.. కుల్దీప్ యాదవ్ ర్యాంక్ను మెరుగుపరుచుకున్నాడు. రోహిత్శర్మ, యశస్వి జైస్వాల్ సైతం తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
ధర్మశాలతో ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు నేలకూల్చాడు. రెండు ఇన్నింగ్స్లతో కలిపి అశ్విన్ 128 పరుగులు ఇచ్చి.. తొమ్మిది వికెట్లు తీశాడు. దీంతో టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ బౌలర్గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ స్థానంలో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కొనసాగాడు. అశ్విన్కు 870 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు బౌలర్ జోష్ హేజిల్వుడ్ 847 రెండో స్థానంలో, జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కగిసో రబడ నాలుగు, పాట్ కమిన్స్ ఐదో స్థానంలో నిలిచారు. టాప్-10 బౌలర్లలో రవీంద్ర జడేజా ఏడో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ టాస్-20లో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ 15 స్థానాలను మెరుగుపరుచుకొని.. 16వ స్థానంలో నిలిచాడు. టాప్-20 భారత బౌలర్లు నలుగురు ఉన్నారు.
ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో రోహిత్, యశస్వి జైస్వాల్ మెరిశారు. ధర్మశాలలో సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాకింగ్స్ను మెరుగుపరుకున్నారు. రోహిత్ శర్మ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరాడు. జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ర్యాంకు దిగజారింది. ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్ సైతం ర్యాంకు దిగజారి.. 15వ స్థానానికి చేరాడు. ధర్మశాల టెస్టులో అద్భుత సెంచరీతో రాణించిన శుభ్మన్ గిల్ 21వ ర్యాంక్కు చేరుకున్నాడు. ఇక టెస్ట్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండో స్థానం, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం మూడో స్థానంలో, న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియాకు ఆటగాడు స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు.
టెస్టు ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్కు చెందిన షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో, ఇంగ్లండ్కు చెందిన రూట్ నాలుగో స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్కు చెందిన జాసన్ హోల్డర్ ఐదో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో అక్షర్ పటేల్ ఒక స్థానం కోల్పోయి ఆరో స్థానానికి చేరాడు.