ICC : వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల వన్డే వరల్డ్కప్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరింత ఆసక్తికరంగా మార్చేసింది. 14 జట్లతో సూపర్ సిక్స్ దశ, సెమీ-ఫైనల్, ఫైనల్.. ఇలా కొనసాగాల్సిన మెగా ఈవెంట్లో కీలక మార్పులు చేసింది ఐసీసీ. తక్కువ ర్యాంకున్న జట్లను దృష్టిలో పెట్టుకొని సూపర్ సిరీస్కు రూపమిచ్చింది అత్యున్నత క్రికెట్ బోర్డు. అంతేకాదు.. సూపర్ 6కు బదులు సూపర్ 7 రౌండ్ తెరపైకి వచ్చింది. దాంతో.. పెద్దజట్లతో పోటీపడలేని పసికూనలకు కూడా ముందంజ వేసే అవకాశం లభించనుంది.
పరుషుల వన్డే వరల్డ్కప్ 2027 ఫార్మాట్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ఐసీసీ. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 14 జట్లు పోటీపడనుండగా.. చిన్న జట్లకు అనుకూలంగా సరికొత్తగా ‘సూపర్ సిరీస్’, ‘సూపర్ 7’ రౌండ్లను ప్రవేశపెట్టింది ఐసీసీ. అంటే.. పద్నాలుగు జట్లలో చివరి మూడు ర్యాంకులోని టీమ్లు సూపర్ సిరీస్ రౌండ్లో తలపడుతాయి. ఈ రౌండ్ ఫలితాల ఆధారంగా ఒక జట్టు గ్రూప్ దశను దాటుంతుంది. మిగతా రెండు టీమ్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
BREAKING: The ICC has announced major changes to the format of next year’s men’s ODI World Cup.
It will remain a 14-team event, but the three lowest-ranked teams will now play a ‘super series’ round for one spot in the main group stage, with two teams eliminated.
12 teams will… pic.twitter.com/89RbSAw2Mk
— Cricinfo (@cricinfo) July 15, 2026
వరల్డ్కప్ గ్రూప్ దశ తర్వాతి రౌండ్ (రెండోది)కు 12 జట్లు అర్హత సాధిస్తాయి. రెండో దశగా పేర్కొనే ఇందులో ఒక్కో గ్రూప్లో ఆరు జట్లు.. మొత్తం 30 మ్యాచులు ఉంటాయి. అయితే.. కొత్తగా ఐసీసీ ప్రవేశపెట్టిన సూపర్ 7 ప్రకారం ఏడు జట్లు నాకౌట్కు చేరుతాయి.

రౌండ్ రాబిన్ పద్ధతి అనంతరం రెండు గ్రూపుల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు.. రెండు గ్రూపుల్లో అత్యధిక పాయింట్లున్న జట్టు ఏడో జట్టుగా సూపర్ 7కు దూసుకెళ్తుంది. ఆపై.. ఈ ఏడింటిలో టాప్-4 జట్లు సెమీఫైనల్కు వెళ్తాయి. సెమీస్ దాటిన జట్లు టైటిల్ పోరులో అమీతుమీకి సిద్ధమవుతాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు జరుగనుంది.