ICC Mens World Cup 2023 | వన్డే ప్రపంచకప్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నెదర్లాండ్స్తో పాకిస్థాన్ (PAK vs NED) తలపడనుంది. ఇక ఇక్కడ జరిగిన గత రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ భారీగా పరుగులు చేసిన పాక్ జట్టు.. ఆ అనుభవాన్ని మెగాటోర్నీలో వినియోగించుకోవాలని చూస్తుంటే.. తొలి మ్యాచ్లోనే పెద్ద జట్టుకు షాక్ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తున్నది.
ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ జట్టులో తెలుగు మూలాలున్న విజయవాడ వాసి తేజా నిడమనూర్ (Teja Nidamanoor) కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఇక నేడు పాకిస్థాన్తో నెదర్లాండ్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా నెదర్లాండ్స్ టీమ్లో ఉన్న తేజ మాట్లాడుతూ.. నెదర్లాండ్స్కు మద్దతు ఇవ్వాలని సోషల్ మీడియాలో కోరాడు.
”హైదరాబాద్ మీకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. మేము ఇవాళ పాక్తో ఉప్పల్లో మ్యాచ్ ఆడుతున్నాం. మీరు గ్రౌండ్కు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము సంతోష పడతాం’ అని తేజ తెలుగులో అభిమానులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.00 నుంచి ప్రారంభంకానుంది.
A special message in Telugu for Hyderabad from Teja Nidamanuru before our #CWC23 🧡 pic.twitter.com/Tbm9hvbfs1
— Cricket🏏Netherlands (@KNCBcricket) October 5, 2023