సిటీబ్యూరో: ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ)లో స్పోర్ట్స్ ఫెస్ట్ ఉత్సాహభరితంగా సాగుతున్నది. పోటీల రెండో రోజు టోర్నీలో ఆన్లైన్, ఆఫ్లైన్ ఈవెంట్లు నిర్వహించారు. ఇందులో బ్యాటిట్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో సరదాగా ఆటలు ఆడారు. ఆ తర్వాత ద థర్డ్ వీల్గేమ్ను నిర్వహించారు. అదే విధంగా ఆఫ్లైన్ ఈవెంట్ల కోసం ఐబీఎస్ మైదానంలో క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ మ్యాచ్లు పోటాపోటీగా జరిగాయి. వీటికి తోడు టీటీ, వాలీబాల్ పోటీలు జరిగాయని నిర్వాహకులు పేర్కొన్నారు.