AB De Villiers | జొహాన్నెస్బర్గ్: టీమ్ఇండియా విరాట్కోహ్లీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశానని దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలీయర్స్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్కు బ్రాండ్ అంబాసీడర్గా కొనసాగుతున్న డివిలీయర్స్ శుక్రవారం కోహ్లీ విషయమై స్పందిస్తూ ‘కుటుంబానికి తొలి ప్రాధాన్యం, ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చాను.
కానీ అదే సమయంలో కోహ్లీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించి తప్పు చేశాను. విరాట్కు అతని కుటుంబానికి ఏదీ నచ్చితే అది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు’ అని అన్నాడు. అనుష్క రెండో సంతానం కోసం ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు విరాట్ దూరమైనట్లు ఏబీ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.