హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐలీగ్లో భాగంగా శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ), రియల్ కశ్మీర్ జట్ల మధ్య జరిగిన పోరు ఎలాంటి గోల్ లేకుండానే డ్రాగా ముగిసింది. గురువారం టీఆర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఎస్డీఎఫ్సీ, రియల్ కశ్మీర్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో నాలుగు మార్పులతో బరిలోకి దిగిన ఎస్డీఎఫ్సీ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. పోరు మొదలైన ఐదో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా ఎస్డీఎఫ్సీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరుస విజయాలతో జోరుమీదున్న శ్రీనిధి ఎఫ్సీ ఈ నెల 11న ఢిల్లీ ఫుట్బాల్ క్లబ్తో తలపడుతుంది.