న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో తాను సాధించిన మెడల్ను దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు మీరాబాయి చాను తెలిపారు. తనను ప్రోత్సహించిన ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా మంత్రి, దేశ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్లో ఇండియాకు తొలి మెడల్ అందించారు. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలిచారు. అనంతరం మీరాబాయి చాను జపాన్ నుంచి భారత్కు సోమవారం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తరుఫున ఢిల్లీలో ఆమెను ఘనంగా సత్కరించారు.
మరోవైపు మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఈవెంట్లో చైనా వెయిట్ లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. అయితే ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీని కోసమే ఆమెను టోక్యోలోనే ఉండాలని ఒలింపిక్స్ అధికారులు ఆదేశించారు. ఒకవేళ ఆమె డోప్ టెస్ట్లో విఫలమైతే రెండోస్థానంలో ఉన్న మీరాబాయికి గోల్డ్ మెడల్ దక్కుతుంది.