న్యూఢిల్లీ: రెజ్లర్ సాక్షీ మాలిక్ ఆవేదనకు గురయ్యారు. రెజ్లింగ్ క్రీడను వదిలేస్తున్నట్లు ఆమె చెప్పారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో .. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ విజయం సాధించడం .. మహిళా రెజ్లర్లను కలిచివేసింది. 40 రోజులగా రోడ్లపై ధర్నా చేపట్టామని, తమకు దేశవ్యాప్తంగా ప్రజలు అండగా నిలిచారని, కానీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమి పాలైనట్లు సాక్షీ మాలిక్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ బిజినెస్ పార్ట్నర్ విజయం సాధించారని, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, అందుకే రెజ్లింగ్ క్రీడకు వీడ్కోలు పలుకుతున్నట్లు సాక్షీ మాలిక్ వెల్లడించారు. సంజయ్ గెలుపును తట్టుకోలేకపోయిన సాక్షీమాలిక్.. మీడియా సమావేశం నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్లిపోయారు.
#WATCH | Delhi: Wrestler Sakshi Malik breaks down as she says “…If Brij Bhushan Singh’s business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling…” pic.twitter.com/26jEqgMYSd
— ANI (@ANI) December 21, 2023
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడం.. రెజ్లింగ్ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లినట్లు ఉందని రెజ్లర్ వినోశ్ పోగట్ తెలిపారు. తమకు స్వల్ప స్థాయిలో మాత్రమే నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ ఉన్నట్లు ఆమె చెప్పారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాము ఇంకా పోరాడుతూనే ఉన్నామన్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్.. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు టాప్ మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే.
#WATCH | Delhi: On former WFI chief Brij Bhushan Sharan Singh’s aide Sanjay Singh elected as the new president of the WFI, Wrestler Vinesh Phogat says, “There are minimal expectations but we hope that we get justice. It’s saddening that the future of wrestling is in the dark. To… pic.twitter.com/Sr8r2Nvuqg
— ANI (@ANI) December 21, 2023