హైదరాబాద్, ఆట ప్రతినిధి: బరోడా వేదికగా ఈ నెల 30నుంచి మొదలయ్యే మహిళల ఇంటర్-జోనల్ వన్డే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెటర్లు త్రిష, మమత చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు సౌత్జోన్ టీమ్ తరఫున ప్రాతిని ధ్యం వహించనున్నారు. శ్రేయాంక పా టిల్ సారథ్యం వహించనున్న సౌత్జోన్ జట్టులో హైదరాబాదీ యువ క్రికెటర్ ప్రణవి చంద్ర స్టాండ్బైగా ఎంపికైంది.