హైదరాబాద్: డర్బన్ వేదికగా మే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ టేబుల్టెన్నిస్ చాంపియన్షిప్(డబ్ల్యూటీటీసీ) ఫైనల్స్కు తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ అర్హత సాధించింది. ఇటీవలే బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో ఆచంట శరత్కమల్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో పసిడి పతకంతో మెరిసిన శ్రీజ మరోమారు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటింది. ఏషియన్ డబ్ల్యూటీటీసీ కాంటినెంటల్ స్టేజ్ టోర్నీలో బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శ్రీజ 11-2, 5-11, 2-11, 5-11, 13-11, 11-9, 11-8తో చెన్షు యు(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో శ్రీజ.. ప్రపంచ 21వ ర్యాంకర్ చెన్షును నిలువరించి వారెవ్వా అనిపించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన మరోవైపు సింగిల్స్లో శరత్కమల్, మానికా బాత్రా..డబ్ల్యూటీటీసీ ఫైనల్స్కు అర్హత దక్కించుకున్నారు.