హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్షిప్లో కొమరవెల్లి లాహిరి విజేతగా నిలిచింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో శనివారం ముగిసిన టోర్నీలో లాహిరి సబ్ జూనియర్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకోగా.. ఆమె సోదరి కొమరవెల్లి దీక్షిత రెండో స్థానంలో నిలిచి రజత పతకం చేజక్కించుకుంది.
మూడు రోజుల పోటీల్లో అదరగొట్టిన ఈ అక్కాచెల్లెల్లు చెరో 15 పాయింట్లతో సమంగా నిలిచారు. ఐదు రేసుల్లో విజేతగా నిలిచిన లాహిరిని నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. బాలుర విభాగంలో బన్నీ స్వర్ణం గెలుచుకోగా.. వినోద్, రిజ్వాన్ వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు.