హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్కేటర్ తళ్లూరి నయనశ్రీ డెహ్రాడూన్లో జరిగిన నేషనల్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిప్లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకంతో మెరిసి వరుసగా ఐదోసారి నేషనల్ చాంపియన్గా నిలిచింది.
మహిళల 500 మీటర్ల ఈవెంట్ను 49.467 సెకండ్లలో, 1000 మీటర్ల పోటీని 1 నిమిషం 47.386 సెకండ్లలో పూర్తి చేసి బంగారు పతకాలు నెగ్గిన యంగ్ స్కేటర్ జూనియర్ మహిళల 1500మీ. పోటీలోనూ అగ్రస్థానంతో స్వర్ణం అందుకుంది. 3000 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో తెలంగాణకు కాంస్యం అందించింది.