ఢిల్లీ: సెప్టెంబర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడలకు హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ ఎంపియ్యాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించిన భారత షూటింగ్ జట్టులో కైనన్ చోటు దక్కించుకున్నాడు. మెన్స్ ట్రాప్తో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో అతడు పోటీపడనున్నాడు. 2022 ఆసియా క్రీడల్లో ట్రాప్, ట్రాప్ టీమ్ ఈవెంట్లలో పతకాలు సాధించిన చెనాయ్..
రాబోయే మెగా టోర్నీలోనూ సత్తాచాటాలనే లక్ష్యంతో ఉన్నాడు. కాగా ఆసియా నంబర్ వన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ జొరావర్ సింగ్కు ఎన్ఆర్ఏఐ షాకిచ్చింది. ఆసియా గేమ్స్ జట్టులో అతనికి చోటు ఇవ్వలేదు. నిరుడు వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యంతో సత్తాచాటిన అతడు.. నేషనల్ చాంపియన్షిప్స్, దేశవాళీ సెలక్షన్ ట్రయల్స్లో మాత్రం నిరాశపరిచాడు.