సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వైఏఐ యూత్ మల్టిక్లాస్ సెయిలింగ్ & సెయిలింగ్ కైట్బోర్డ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ సెయిలర్ అలేఖ్య కుందు పసిడి పతకంతో మెరిసింది. కావేరి నది పరివాహక ప్రాంతమైన కృష్ణరాజ్సాగర్ డ్యామ్లో జరిగిన జాతీయ ర్యాంకింగ్ ఈవెంట్లో అలేఖ్య అద్భుత ప్రతిభ కనబరిచింది. వేగంగా వీస్తున్న గాలులకు తోడు అలల తాకిడిని ఎదుర్కొంటూ 420 సెయిలింగ్ క్లాస్లో ఈ యువ సెయిలర్ స్వర్ణాన్ని ముద్దాడింది. టోర్నీలో సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అలేఖ్య.. కార్తీక్తో కలిసి పోడియం ఫినిష్ చేసింది. బ్రిజ్రాజ్ వర్మ దగ్గర ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఈ అమ్మాయి.. భవిష్యత్లో ఆసియాగేమ్స్, ఒలింపిక్స్ లాంటి మెగాటోర్నీల్లో రాణించాలన్న పట్టుదలతో ఉన్నది. రామంతపూర్ హెచ్పీఎస్లో విద్యనభ్యసిస్తున్న అలేఖ్య…సెయిలింగ్ కెరీర్ను కొనసాగిస్తున్నది. ఖాళీ సమయాల్లో స్విమ్మింగ్, గిటార్ వాయించడం ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.