హైదరాబాద్: హైదరాబాద్ సెయిలింగ్ వీక్కు వేళయైంది. సోమవారం నుంచి హుస్సేన్సాగర్ వేదికగా 36వ ఎడిషన్ మొదలవుతున్నది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి 75 మంది సెయిలర్లు పోటీపడుతున్నారు. ఈ టోర్నీలో ప్రముఖ క్లబ్లుగా పేరొందిన ఆర్మీ యాచింగ్ నోడ్ ముంబై, ఐఎన్డబ్ల్యూటీసీ నేవీ ముంబై, త్రిష్న సెయిలింగ్ క్లబ్, నేషనల్ సెయిలింగ్ స్కూల్(భోపాల్), యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, నేవీ బాయ్స్ స్కూల్(గోవా) బరిలోకి దిగుతున్నాయి.
ఈసారి ఒలింపిక్, ఆసియా గేమ్స్లో విభాగాలైన లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 విభాగాలుగా పోటీలు ఉండనున్నాయి. ముఖ్యంగా బాలుర, బాలికల యూత్ విభాగాల్లో ఈసారి ఎక్కువ మంది సెయిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆసియా గేమ్స్ సహా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు అర్హతగా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటామని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ కార్యదర్శి విక్రాంత్ పేర్కొన్నారు.