హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో గాడియం క్యాంపస్లో స్టేడియం రన్ తొలి ఎడిషన్ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగిన పరుగు పందెంలో 350 మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. 40 మంది సోలో రన్నర్లతో పాటు 52 జట్లు టీమ్ రిలేలో పోటీ పడ్డాయి. ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్, హైదరాబాద్ గ్రోత్ కారిడర్ ఎండీ బీఎం సంతోష్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాడియం గ్రూపు చైర్మన్ నిత్యానందరెడ్డి, డైరెక్టర్ కృతిరెడ్డి పాల్గొన్నారు. పూర్తిస్థాయి కొవిడ్ జాగ్రత్తల మధ్య స్టేడియం రన్ కొనసాగింది. సోలో రన్ పురుషుల విభాగంలో జగన్మోహన్రెడ్డి, కేవీబీ రెడ్డి, హరి తొలి మూడు స్థానాల్లో నిలువగా, మహిళల కేటగిరీలో యామిని, తరు, పూనమ్ టాప్-3 దక్కించుకున్నారు. ఈ రన్లో టీన్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేశ్బాబు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.