హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఆసియా ఓషియానా టోర్నీలో బరిలోకి దిగే భారత టెన్నిస్ జట్టుకు హైదరాబాద్ ప్లేయర్లు యమ్లపల్లి సహజ, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఎంపికయ్యారు. తాష్కెంట్(కజకిస్థాన్) వేదికగా వచ్చే నెల 10వ తేదీ నుంచి మొదలయ్యే టోర్నీ కోసం సెలెక్టర్లు సోమవారం ఐదుగురితో కూడిన జట్టును ప్రకటించారు. నందన్బాల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్లేయర్ల ర్యాంకింగ్స్, ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ జట్టును ఎంపిక చేసింది. అంకితా రైనా (241 ర్యాంక్), కర్మాన్కౌర్ థండీ (268), రుతుజా భోస్లే (419), సహజ యమ్లపల్లి (454), వైదేహి చౌదరీ (492) భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుండగా, రష్మికను రిజర్వ్ ప్లేయర్గా తీసుకున్నారు. షాలిని ఠాకూర్ కెప్టెన్గా, రాధిక కనిత్కర్ కోచ్గా వ్యవహరించనున్నారు. రానున్న రోజుల్లో వైదేహి, సహజ నుంచి మరింత మెరుగైన ఫలితాలు ఆశించవచ్చని నందన్బాల్ పేర్కొన్నారు.