సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసుకు రంగం సిద్ధమవుతున్నది. నగరం వేదికగా తొలిసారి జరుగనున్న రేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో నగరం నడిబొడ్డున లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో ఎంపిక చేసిన 2.3 కి.మీ రోడ్డును ఫార్ములా-ఈ రేసు కోసం ప్రభుత్వం ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నది. హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించిన మార్గంలో అడ్డుగా ఉన్న వాటిని తొలిగిస్తూ కొత్తగా ట్రాక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు పెట్టి పనులు పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రయత్నిస్తున్నది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జరిగే ఫార్ములా-ఈ రేసింగ్లో పాల్గొనే కారును నిర్వాహకులు ఆదివారం ట్యాంక్బండ్పై ప్రదర్శించనున్నారు.