హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ అండర్-19 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ గొంగడి త్రిషను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) బుధవారం సన్మానించింది. జింఖానా మైదానంలో జరిగిన కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్..త్రిషకు రూ.3లక్షల చెక్ అందజేశారు. మరోవైపు త్రిషను తీర్చిదిద్దిన కోచ్ శ్రీనివాస్కు రూ.25వేల నగదు ప్రోత్సాహకం ఇచ్చారు.