హైదరాబాద్, ఆట ప్రతినిధి: సొంతగడ్డపై హైదరాబాద్ బ్లాక్హాక్స్ జోరు కొనసాగిస్తున్నది. ప్రైమ్ వాలీబాల్ లీగ్లో భాగంగా శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోరులో హైదరాబాద్ 3-2 (10-15, 15-14, 15-9, 12-15, 15-11)తో చెన్నై బ్లిట్జ్పై గెలుపొందింది. కెప్టెన్ గురు ప్రశాంత్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో హోరాహోరీ పోరులో బ్లాక్హాక్స్ విజయం వైపు నిలిచింది. లీగ్లో హైదరాబాద్కు ఇది మూడో విజయం కాగా.. చెన్నైకి మూడో పరాజయం. తొలి గేమ్ కోల్పోయిన బ్లాక్హాక్స్ ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు గేమ్లు నెగ్గినా.. ప్రత్యర్థి పుంజుకోవడంతో మ్యాచ్ చివరి గేమ్కు వెళ్లింది. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహయజమాని, సినీ నటుడు విజయ్ దేవరకొండ మ్యాచ్ వీక్షిస్తూ ఆటగాళ్లలో ఉత్సాహం నింపాడు.