కోల్కతా: మహిళల అండర్-23 టీ20 టోర్నీలో హైదరాబాద్ కెప్టెన్ గొంగడి త్రిష సూపర్ ఫామ్ కొనసాగుతున్నది. బుధవారం జమ్ముకశ్మీర్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కెప్టెన్ త్రిష(63) అర్ధసెంచరీతో అదరగొట్టింది. మరో హైదరాబాదీ ప్రణవి చంద్ర(31)తో కలిసి త్రిష జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించింది. వీరిద్దరు జమ్ము బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్కు 84 పరుగులు జోడించారు.
ముఖ్యంగా త్రిష తన ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు భారీ సిక్స్లతో వరుసగా రెండో అర్ధసెంచరీని ఖాతాలో వేసుకుంది. వీరిద్దరు మినహా హైదరాబాద్ టీమ్లో ఎవరూ డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయారు. జమ్ము బౌలర్ నూరిన్కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన జమ్ము కశ్మీర్ 103/6 స్కోరుకు పరిమితమైంది. బౌలింగ్లోనూ ఇరుగదీస్తూ త్రిష తొలి బంతికే వికెట్ దక్కించుకోగా, ఇషిత కోడూరి(2/21) రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది.