హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతున్నది. కెప్టెన్ యశ్ధల్(72), ఆయూశ్ బదోనీ(78 నాటౌట్) అర్ధసెంచరీలతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 223/5 స్కోరు చేసింది.
అజయ్దేవ్గౌడ్, అనికేత్రెడ్డి రెండేసి వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 247/4 రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ 355 పరుగులకు ఆలౌటైంది. రోహిత్రాయుడు(153 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. సహచర బ్యాటర్ల నుంచి అంతగా సహకారం లేకపోయినా సాధికారిక ఇన్నింగ్స్తో రాణించాడు. హర్షిత్ రానా, దివిజ్ మెహ్రా మూడేసి వికెట్లు తీశారు.