హిసార్ : జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్ఫైనల్కు చేరాడు. మంగళవారం జరిగిన పోటీలో హుసాముద్దీన్ మిజోరాంకు చెందిన లల్లామవ్మాను చిత్తుచేశాడు. ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన హుసాముద్దీన్ను రెఫరీలు ఏకపక్షంగా విజేతగా నిర్ణయించారు. ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత మనీష్ కౌశిక్, కామన్వెల్త్ చాంపియన్ గౌరవ్ సోలంకి కూడా క్వార్టర్స్ చేరారు.