న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా భారత క్రికెట్ జట్టుకు ఎంతో విలువైన ఆటగాళ్లు. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో తన సత్తా చాటుతుండగా.. పుజారా టెస్టు క్రికెట్కు ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. అయితే, ఈ ఇద్దరు బ్యాటర్లు గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్లో పెద్దగా రాణించలేకపోతున్నారు. 2020 నుంచి ఇప్పటివరకు వారి గ్రాఫ్ వరుసగా పడిపోతూ వస్తున్నది.
ప్రస్తుతం లండగన్లోని ఓవల్ స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కూడా ఈ ఆటగాళ్లిద్దరూ విఫలమయ్యారు. ఇద్దరూ కేవలం 14 చొప్పున పరుగులు చేసి పెవిలియన్కు వెళ్లిపోయారు. ఇలాంటి ఆటతీరు వల్లే ఈ ఇద్దరు క్రికెటర్ల బ్యాటింగ్ సగటులు రోజురోజుకు పడిపోతున్నాయి.
టెస్టుల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సగటు 2020లో 53.62గా ఉండేది. కానీ ఇప్పుడది 48.72కు పడిపోయింది. అదేవిధంగా పుజారా బ్యాటింగ్ సగటు కూడా 2020లో 48.66గా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో పేలవమైన ఆటతీరుతో ఇప్పుడది 43.70కు దిగజారింది.